కేటీఆర్ను ఆకట్టుకున్న గులాబీలు

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీలు మంత్రి కేటీఆర్ ను ఆకట్టుకున్నాయి. నర్సరీ ఫొటోలను తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ అందమైన ఫొటోలు ఎక్కడ నుంచి వచ్చాయో ఊహించండి? అంటూ తన ఫాలోవర్లను ప్రశ్నించారు.
ఎక్కడ నుంచి వచ్చాయంటే..
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీలు అంటూ మంత్రి కేటీఆరే సమాధానం చెప్పారు.కోరుట్ల నర్సరీ లాగే రాష్ట్ర పురపాలక పట్టాభివృద్ధిశాఖ శాఖ తెలంగాణలోని 141 పట్టణాల్లో 1,012 నర్సరీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరో 600 నర్సరీలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కోరుట్ల మున్సిపల్ కమిషన్ను అభినందించారు. గ్రేట్ జాబ్ మున్సిపల్ కమిషనర్ గారూ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.